న్యూడిల్లీ: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి సురవరం సుధాకర్రెడ్డి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం మరొక రెండు సంవత్సరాలు ఉండగా అనారోగ్య కారణాలతో పదవీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. 2012 నుంచి సుధాకర్రెడ్డి ఆ పదవిలో కొనసాగుతున్నారు. సురవరం స్థానంలో సీపీఐ నూతన ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు డి. రాజా(70)ను ఎన్నుకున్నారు. సుదీర్ఘకాలంగా సీపీఐ జాతీయనేతగా ఉన్న డి. రాజా ఎన్నికను సీపీఐ జాతీయ మండలి సమావేశం ఆమోదించింది. శుక్రవారం ప్రారంభమైన సీపీఐ జాతీయ మండలి సమావేశంలో నాయకత్వ మార్పు గురించి చర్చించారు. అంతకుముందు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం రాజా పేరును ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. 72 ఏండ్ల వయసున్న డీ రాజా తమిళనాడు నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.