ఢిల్లి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు షీలాదీక్షిత్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్ బోధ్ ఘాట్లో షీలాదీక్షిత్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు షీలాదీక్షిత్ పార్థివదేహాన్ని కాంగ్రెస్ కార్యాలయంలో సందర్శకుల దర్శనార్థం ఉంచనున్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో షీలాదీక్షిత్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.