కృష్ణా:కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్లోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్సర్క్యూట్తో నాలుగంతస్తుల భవనంలో మంటలు చెటరేగాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వచ్చి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.30 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.