ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మృతిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. దీక్షిత్ మృతి తీరని లోటన్న కేజ్రీవాల్ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. పార్టీ సీనియర్ నేత అయిన ఆమె మృతిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ముఖచిత్రాన్ని షీలా దీక్షిత్ మార్చేశారని, ఆమె కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.