ముంబై : మహారాష్ట్రలోని పుణె - సోలాపూర్ హైవేపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను పుణెకు సమీపంలోని యావత్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.