ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరుసగా నాలుగుసార్లు భూప్రకంపనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2019, 10:16 AM

గుహవాటి : అరుణాచల్‌ప్రదేశ్‌లో వరుసగా నాలుగు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం మూడు సార్లు భూమి కంపించగా, ఇవాళ తెల్లవారుజామున మరోసారి భూమి కంపించింది. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై వరుసగా 5.6, 3.8, 4.9, మరియు 5.5గా నమోదయ్యాయి. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.  శుక్రవారం మధ్యాహ్నం 2:52 గంటల సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈస్ట్ కామేంగ్ జిల్లాలో భూమి కంపించింది. ఇక్కడ 5.6గా భూకంప తీవ్రత నమోదైంది. మధ్యాహ్నం 3:04 గంటల సమయంలో 3.8 తీవ్రతతో ఈస్ట్ కామేంగ్ జిల్లాలోనే మరోసారి భూమి కంపించింది. ఇక మూడో ప్రకంపనం.. మధ్యాహ్నం 3:21 గంటల సమయంలో కురుంగ్ కుమేయ్ జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున 4:24 గంటల సమయంలో మరోసారి ఈస్ట్ కామేంగ్ జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూప్రకంపనల నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com