ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి ప్రక్షాళన లో భాగంగా రేషన్ డీలర్ల ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆయన గురువారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రజాపంపిణీ అంశంపై చర్చ సందర్భంగా డీలర్లు ఉంటారా? ఉండరా? అన్న ప్రస్తావన వచ్చినప్పుడు కొత్త వ్యవస్థ వస్తున్న నేపథ్యంలో ఇకపై రేషన్ డీలర్లు ఉండరని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు
త్వరలో రానున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో రేషన్ సరుకులు డోర్ డెలివరీ వాలంటీర్ల ద్వారా నెలనెల సరుకులు ఇంటింటికి సరఫరా చేస్తారని, ఇందుకు వేలి ముద్రలు పడకపోయినా ఆధార్ నెంబర్ ఆధారంగా రేషన్ అందచేస్తారని వివరించారు. పెద్ద బియ్యం సరఫరా చేయడం వల్ల ప్రజలు తిరిగి వాటిని బయట అమ్ముకుంటున్నారని అవి తిరిగి మిల్లర్లకు చేరుతున్నాయని, ఇక సన్న బియ్యాన్నే సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు
ఇకపై ఇప్పటి వరకు ప్రజాపంపిణీ వ్యవస్థ లో కీలకంగా పనిచేసిన రేషన్ డీలర్ లు ఉండరన్నది ఖాయమైంది.