ఇసుక , రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు వారి కుటుంబాల ప్రయోజనార్థం ఇసుక రీచ్ లు కేటాయించాలని, క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నమ్మి అప్పల మాధవ రావు (అయ్యప్ప) డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఈ రంగం పైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న వందలాది కుటుంబాలను ప్రభుత్వం నిర్ణయాలు అగమ్యగోచరంకి గురి చేస్తున్నాయని వాపోయారు.
గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక, మహిళా సంఘాలు ఇలా అనేక మందికి రీచ్లు అప్పగించిందని దీంతో తమకు న్యాయం జరగకపోగా, ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం మరింత నిరాశాజనకంగా మారిందన్నారు. ఈ విధానం వల్ల ఆర్థికంగా, మానసికంగా ఎంతో నష్టపోయామని తెలిపారు. మైనింగ్, విజిలెన్స్, పోలీస్ శాఖల దాడుల వల్ల దాదాపు 650 వాహనాలు సీజ్ కాగా రెండు లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాల్సి వచ్చిందన్నారు. తాజా పరిస్థితుల వల్ల ఇసుక రవాణా చేస్తున్న సుమారు మూడు వేల వరకు లారీలు ఎక్కడివక్కడ నిలిచిపోయే పరిస్థితి తలెత్తిందన్నారు.
తక్షణమే ప్రభుత్వం రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో కనీసం రెండు ఇసుక రీచ్ (ర్యాన్ప్)కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇసుక ధరను నిర్ణయించి ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాలని , ఆ నిర్ణయాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని కోరారు.