అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమెదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయాలు ఇవే:
అంగన్ వాడీ జీతాల పెంపు. అంగన్ వాడీ వర్కర్లకు రూ. 11,500, మినీ అంగన్ వాడీ వర్కర్లకు రూ. 7 వేలు, అంగన్ వాడీ హెల్పర్లకు రూ. 7వేల జీతం.
ఆక్వాకు యూనిట్ విద్యుత్ రూ. 1.50కే సరఫరా.
జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం.
ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
1,33,867 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్.
కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందిన బిల్లుకు ఆమోదం.
మద్య నిషేధం దిశగా తొలి దశ చర్యలకు శ్రీకారం. మద్యం దుకాణాల నిర్వహణ ప్రభుత్వానిదే.
గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు ఆమోదం. నెలకు రూ. 5 వేల జీతం.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్కు కోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో ఏపీఐఐసీకి 149 ఎకరాల అప్పగింత.