సమోయ్ -2019 పసిఫిక్ గేమ్స్ వెయిట్ లిఫ్ట్ లో కామన్వెల్త్ చాంపియన్ బంగారు మరియు వెండి పధకాలు కైవసం చేసుకుని మన రాష్ట్రంలో బుధవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కడప వై ఎస్ ఆర్ స్పొర్ట్స్ స్కూల్ విద్యార్థి ఎ.శివరామకృష్ణ యాదవ్ కు ప్రభుత్వం తరుపున ఘనస్వాగతం లభించించింది. సమోయ్ -2019 పసిఫిక్ గేమ్స్ ఈనెల 6 నుండి 15 వరకు సమోయ్ దేశంలో అంతర్జాతీయ క్రీడలు ఘనంగా జరిగాయి. ఈ క్రీడల్లో కడప స్పొర్ట్స్ స్కూల్ ఇంటర్ 2 వసంత్సర విధ్యార్థి ఎ.శివరామకృష్ణ పురుషుల – యువత కేటగిరీ 81 కేజీల వెయిట్ లిఫ్ట్ లో బంగారు పథకం, పురుషులు – జూనియర్ కేటగిరీలో 81 కేజీల వెయిట్ లిఫ్ట్ లో వెండి పథకం కైవసం చేసుకుని మొదట మనరాష్ట్రంలోని రేణిగుంట విమానశ్రయం చేరుకుంటున్న నేపద్యంలో జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా ఆదేశాలమేరకు ప్రభుత్వం తరుపున అధికారులు, క్రీడాకారులు, కోచ్ లు, విమానాశ్రయ అధికారులు , స్కూల్ విధ్యార్థులు, మీడియా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం అందుకున్న విజేత రామకృష్ణ అందరికి ధన్యవాదాలు తెలిపి స్వంత జిల్లా వై ఎస్ ఆర్ కడప బయలు దేరి వెళ్లారు.