గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లో పారిశుధ్ధ్యం మెరుగుపరచాలని, వచ్చే సోమవారం నుండి ఆశ్రమాలు తనిఖీలు చేస్తామన్నారు. పాడేరు సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డి కె బాలాజీ ఆదేశించారు. బుధవారం పాడేరు ఐటిడి ఏ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖాధికారి , సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో సహాయ గిరిజన సంక్షేమాధికారులు,గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆశ్రమ పాఠశాలలు ఉన్న స్దితినుండి ఉన్నత స్దితి అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహల్లో పరిశుభ్రత పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో బూజులు తుడవడానికి ప్రాజెక్టు అధికారి ఆదేశాలు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. చిన్నపాటి మరమ్మతులు,విద్యుత్తు దీపాల ఏర్పాటు చేయడంలేదన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో మరమ్మతులు దీపాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టర్న్ డ్యూటీ సిబ్బంది తప్పని సరిగా స్దానికంగా ఉండాలన్నారు.