ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఎమ్మెల్యేలని చులకన చేసి మాట్లాడటం జగన్‌కి తగదు: కోడెల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 14, 2019, 03:40 PM

23 మంది టీడీపీ ఎమ్మెల్యేలని చులకన చేసి మాట్లాడటం జగన్‌కి తగదని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ రెండు నెలలు గడవక ముందే టీడీపీ నాయకులపై 400 కేసులు పెట్టారని విమర్శించారు. వైసీపీ వాళ్లే కొడుతూ వైసీపీ వాళ్లే కేసులు పెడుతున్నారన్నారు. వైసీపీ దౌర్జన్యానికి తానూ ఒక బాధితుడినేనన్నారు. ఏపీలో పెట్టుబడిదారులకి అనువైన వాతావరణం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పనితీరు వల్ల పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వ బడ్జెట్‌లో ముఖ్యమైన అంశాలే లేవన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com