ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ ఎంపీ మదన్‌ లాల్‌ సైనీ మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2019, 01:59 PM

రాజస్థాన్‌ బీజేపీ అధ్యక్షుడు మరియు రాజ్యసభ సభ్యుడు మదన్‌ లాల్‌ సైనీ(75) ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో గతకొంతకాలంగా బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం శనివారం మరింత క్షీణించడంతో జైపూర్‌ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మదన్‌ లాల్‌ మాజీ ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్‌ కూడా. గతేడాది రాజస్థాన్‌ బీజేపీ అధ్యక్షుడిగా మదన్‌ లాల్‌ నియమితులయ్యారు. భారతీయ కిసాన్‌ మోర్చాలో ఆయన ఎన్నో పదవులను అలకరించారు. మదన్‌ లాల్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఇంకొందరు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com