శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రెండో రోజు సదస్సులో జరుగుతున్న శాంతిభద్రతలపై చర్చలో ఆమె మాట్లాడుతూ మహిళా సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గంజాయిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులకు తొలిసారిగా వీక్లీఆఫ్ విధానం ప్రవేశపెట్టామన్నారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు.