ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు రుణ మాఫీ చెల్లింపులు చేయాల్సిందే : టిడిపి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2019, 05:52 PM

ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే ప్రభుత్వం రైతులకు చెలించవలసిన 4,5 వ విడత రుణమాఫీ సొమ్మును వెంటనే చెల్లించాలని, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి  డిమాండ్ చేసారు. సోమ‌వారం కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ  గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి పీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టి కాలేజీలకు బకాయిల పెట్టి పోతే, తరువాత ముఖ్యమంత్రి అయిన రోశయ్య బకాయిలు చెల్లించి మరల కొత్త బకాయిలు పెట్టార‌ని, వాటిని తదనంతరం వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి  చెల్లించినా,  రాష్ట్ర విభజన సమయానికి  ఎపికి  3600 కోట్ల రూపాయల పీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇచ్చిన విష‌యం జ‌గ‌న్ గుర్తెర‌గాల‌న్నారు.  వాటిని నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని చెల్లించార‌ని,   ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు మారుతుంటారు గాని ప్రభుత్వాలు శాస్వితంగా ఉంటాయని, అధికారంలోకి వచ్చిన వారు గత ప్రభుత్వ బకాయిలను చెల్లించవలసి బాధ్యత వారి పై ఉంటుందని స్ప‌ష్టం చేసారు. 


 గతంలో ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుంటే దానిలో పెద్ద ఎత్హున దోపిడీ జరుగుతుందని గోబెల్స్ ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి ఇసుకకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఎటువంటి పాలసీని ప్రకటించకుండా ఇసుకను నిలిపి వేయడము వలన గతంలో వెయ్యి రూపాయల కు దొరుకుతున్న ట్రాక్టర్ ఇసుక నేడు 3 వేల రూపాయలు అయిందని దీని వలన ప్రజలకు ఏమి మేలు జరిగిందో తెలియ చేయాలని, రానున్న స్థానిక సంస్థలు ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సన్నద్ధం కావాలని కోరారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com