ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించడం అన్యాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2017, 12:50 AM

  విజయవాడ, సూర్య బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ 13 జిల్లాలకు చెందిన కాంట్రాక్ట్‌ ఉద్యోగస్ధులను అకారణంగా తొలగించడం దురదృష్టకరమని, ఆరు రోజులైనా కూడా యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ స్పందించకపోవడం బాధాకరమని జనసేన పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యకర్త పోతిన వెంకట మహేష్‌, స్టేట్‌బ్యాంక్‌ ఎంప్లారుూస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఆర్‌.అజయ్‌ కుమార్‌, సీపీఎం రాష్ర్ట, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితర నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నగరంలో ఆరవ రోజు నిరసన రిలే నిరాహార దీక్షలులో వారు మాట్లాడుతూ ఈ  సంస్ధను నమ్ముకుని గత 12 సంవత్స రాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించడం అన్యాయమని గత అయిదు నెలలుగా వీరు ఉద్యోగాలు లేక రోడ్డుపై పడినా  సంస్ధ యాజమాన్యం కాని రాష్ట్ర ఫ్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ సంస్ధ సెక్రటరీ అయిన సంజయ్‌గుప్తా(ఐఎఫ్‌ఎస్‌) వీరిని దక్షిణ భారతీయులు అయినందున వీరిని తొలగించి ఆ స్థానంలో అధిక జీతాలుకు ఉత్తర భారతీయులను కూడా నియమించడం తెలుగువారికి చేస్తున్న తీవ్రమైన అన్యాయమని అన్నారు. హుదూద్‌ తుఫాన్‌ సమయంలో పదిహేను రోజుల పాటు 24 గంటలు కుటుంబాలకు దూరంగా ఉండి నష్టాలు అంచనా వేయడంతో పాటు విశిష్ట సేవలు అందించిన విషయం, అట్లాగే ఈ కాంట్రాక్ట్‌ ఉద్యోగస్థులు ద్వారానే అమలు చేయబడిన నీరుచెట్టు, వాటర్‌షెడ్గ, వాటర్‌గ్రిడ్గ, ఫైబర్‌గ్రిడ్గ, ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో సేవలందించినా మానవతాదృక్పధం కూడా సంస్ధ సెక్రటరీ అయిన సంజయ్‌గుప్తాకు లేకపోవడం విచారకరమన్నారు. ఇటువంటి ఉన్నత చదువులు చదివిన ఉద్యోగస్తులను అవమానపరుస్తూ తమ రాష్ర్టం వారిని ఉత్తేజపరుస్తూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం తగదన్నారు. వెంటనే వీరిని ఉద్యోగాల్లోనికి తీసుకుని, ఐదు నెలల బకాయిలు చెల్లించాలని చెల్లించలేని పక్షంలో న్యాయం జరిగేంతవరకు ఎంతటి ఉద్యమా నైనా నిర్వహిస్తామని వారిని హెచ్చరిస్తూ తమ మద్దతును తెలిపారు. ఏపీ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఎ.ఎమ్‌.రాజు మాట్లాడుతూ తమని ఉద్యోగాలనుంచి తొలగించి వేరొకరిని నియమించి మమ్మల్ని రోడ్డున వేయడం న్యాయమైంది కాదని ఇప్పటికైనా యాజమాన్యం మా 35 మందిని విధులలోకి తీసుకుని తమకి న్యాయం చేయాలని సంస్ధని కోరుతున్నామన్నారు. రాష్ర్ట మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.టక్కర్‌ ఇచ్చిన (35 సంల కాంట్రాక్టు, పే స్కేల్‌) హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ఈ దీక్షలో జె.కృష్ణవేణి, ఆర్‌.కనకరాజు, కె.ఈశ్వరరావు, ఎల్‌.కుమారస్వామి, జి.అరుణ్‌కుమార్‌ తదితర కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com