ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌-బంగ్లా మధ్య కీలక ఒప్పందాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 08, 2017, 02:41 PM

న్యూదిల్లీ: భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య కీలక ఒప్పందాలు ఒప్పందాలు జరిగాయి. భారత ప్రధాని మోదీ, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాల సమక్షంలో 22 కీలక ఎంవోయూలు జరిగాయి. వీటిల్లో రక్షణ, అణుఇంధన, మరికొన్ని అంశాలపై కూడా ఒప్పందాలు జరిగాయి. కోల్‌కతా, ఢాకా మధ్య రైలు సర్వీసును ఇరు దేశాల ప్రధానులు ప్రారంభించారు. నుమాలీగఢ్‌ నుంచి పరబాతిపూర్‌ వరకు డీజిల్‌ ఆయిల్‌పైప్‌లైన్‌కు ఆర్థిక సహకారం అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. సాంకేతిక రంగంలో కుదిరిన ఒప్పందాలు ఇరుదేశాలకు ఉపయోగకరమైనవేనని తెలిపారు. బంగ్లాదేశ్‌ భారత్‌కు సుదీర్ఘకాలంగా నమ్మదగిన మిత్రుడిగా ఉందని అన్నారు. ప్రధాన్యత రంగాల్లో బంగ్లాదేశ్‌కు భారత్‌ నుంచి సహకారం ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com