(అమరావతి-సూర్య ప్రధాన ప్రతినిధి) : నవ్యాంధ్ర రాజసౌధానికి చక్కని నూతన రహదారులు సమకూరనున్నాయి. రాజధాని అమరావతిలోని అన్ని నగరాలు, టౌన్షిప్లను కలుపుతూ అందమైన రహదారుల నిర్మాణానికి నాంది పలికారు. సుమారు రూ.1020 కోట్ల అంచనా వ్యయంతో 7 ప్రాధాన్య రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అమరావతి డెవలప్మెంట్ సంస్థ (ఏడీసీ) దీని బాధ్యతలు చూస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉగాది పర్వదినాన ప్రాధాన్యత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో నిర్మాణాలు చేస్తున్నారు. ఏపీ సీఆర్డీఏ 29గ్రా మాల్లోని రైతులు స్వచ్ఛందంగా సుమారు 33వేల ఎకరాలు భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. రాజధాని అమరావతి పరిపాలన భవనాలకు చేరుకో వాలంటే విజయవాడ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ రోడ్లు నిర్మిస్తున్నారు. అన్ని రోడ్లు తూర్పు, ఉత్తరం ముఖంతో వెళ్లేలా నమూనా రూపొందించారు. రాజధానిలో తొలి దశగా 7 ప్రాధాన్య రోడ్లు 67 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. వీటిని ఎక్స్ప్రెస్ హైవేగా పిలుస్తారు. ప్రతి రోడ్డు పక్కన మొక్కలు నాటాలని నిర్ణయించారు. వీధి దీపాలు, సైకిల్ ట్రాక్ వంటి సదుపాయాలు ఉంటాయి. 7 రోడ్లలో 3 పడమర నుంచి తూర్పు వైపునకు, 4 దక్షిణం నుంచి ఉత్తర దిశగా ప్రయాణించేందుకు వీలుగా నిర్మిస్తారు. మంగళగిరి నిడమర్రు బేతపూడి, శాఖమూరు, నెక్కల్లు నుంచి ఉత్తర ముఖంగా కృష్ణానది వరకు 4 రోడ్లు నిర్మాణం చేస్తారు. అనంతవరం, పిచ్చుకలవారిపాలెం, బోరుపాలెం, నెక్కల్లు నుంచి తూర్పుదిశగా విజయవాడ వైపు మూడు రోడ్లు వస్తాయి. ప్రతిరోడ్డు 60 మీటర్లు, 50, 40 మీటర్లుగా వెడల్పు ఉంటుంది. రోడ్డు పొడవు 8 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల పొడవున నిర్మించేలా రూపొందించారు. రోడ్ల పొడవు ఇలా ఉంటుంది. 14.85 కిలోమీటర్లు, 12.5, 9.97, 8.25, 7.8, 7.26 7.17 కిలోమీటర్లుగా నిర్మాణం చేస్తారు. రాజధాని పరిధిలో ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో ఉంది. జాతీయ రహదారి వద్ద మణిపాల్ నుంచి దొండపాడు వరకు 21.3 కిలోమీటర్ల పొడవున ఎనిమిది వరుసల రోడ్డు నిర్మిస్తున్నారు.
గ్రామీణ ప్రజలకు అనేక ప్రయోజనాలు : రహదారుల నిర్మాణంతో గ్రామీ ణులకు అనేక ప్రయోజనాలు చేకూరుతుంది. మరోవైపు త్వరలో నిర్మాణం కానున్న విశ్వవిద్యాలయాలు, మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇలా అన్ని ప్రాధాన్యత సంస్థలకు రావాణా సదుపాయం మెరుగుపడుతుంది. గ్రామాల్లో లేఅవుట్లు సిద్ధం చేస్తున్నారు. 29గ్రామాలు, 27 టౌన్షిప్లకు ఈ రహదారులు ఉపయో గ రంగా ఉంటాయి. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, తెనాలి ప్రాంతాల నుంచి వచ్చేవారికి రవాణా సదుపాయం కలుగుతుంది.
తూర్పు-ఉత్తర ముఖంలో రహదారులు : రాజధాని పరిధిలోని అన్ని రహదా రులు తూర్పు-ఉత్తర ముఖంగా నిర్మాణం చేయనున్నారు. మొత్తం 34 రహదా రులు నిర్మించాలని ఏడీసీ నమూనా సిద్ధం చేసింది. తూర్పు ముఖంతో 16, ఉత్తరం వైపునకు 18 రోడ్లు వస్తాయి. వీటి నిర్మాణానికి రూ.1800 కోట్లు వెచ్చిస్తారు. మొదటి దశలో భూమి అందుబాటు, భూసమస్యలు లేని ప్రాం తాలను ఎంపిక చేసి నిర్మిస్తున్నారు.
సైకిల్ట్రాక్తో పాటు నడకదారి : ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన రహదా రులను అత్యంత సుందరంగా నిర్మించనున్నారు. ఎక్స్ప్రెస్ హైవేగా పిలిచే రహదారులకు ఇరువైపులా పచ్చదనం ఫరిడివిల్లేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఉత్తర ముఖంతో వెళ్లే రహదారులు రాజధాని పాలనా కేంద్రం నుంచి నేరుగా కృష్ణానది వరకు వెళతాయి. నదిపై నిర్మించే రెండు రహదారి వంతెనల మీదుగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం చేరుకునేందుకు వీలుగా ఉంటాయి.