అమరావతి : మరి కొద్ది సేపటిలో ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు హైదరాబాద్ నుంచి అమరావతి బయలు దేరిన గవర్నర్ నరసింహన్ గన్న వరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అసెంబ్లీ ఆవరణలోని ఖాళీ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.