ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంది ఫిల్మ్‌ అవార్డుల ఎంట్రీలకు గడువు పెంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2017, 01:12 AM

విజయవాడ, సూర్య బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, 2015, 2016  సంవత్సరాలకు గానూ  ఉత్తమ చ్త్రి నిర్మాణాల, ఉత్తమ కళాకారుల, సాంకేతిక నిపుణులకు సంబంధించి నంది ఫిల్మ్‌ అవార్డుల ఎంపిక  గడువును ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట ప్రభుత్వం పెంచింది. అంతకు ముందు ప్రకటించిన గడువు తేదీని 31.03.2017 నుంచి 08.04.2017కు పెంచడం జరిగింది. ఏప్రిల్‌ 8వ తేదీ వరకూ ఎంపిక  ప్రక్రియ కొనసాగనుందని అందుకోసం నిర్మాతల నుంచి ఎంట్రీ ఫారాలను కోరడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌, టీవీ అండ్గ థియేటర్‌  డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీలలో 2014, 2015, 2016 సంవత్సరాలకు (ఆయా సంవత్సరాలలో జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 మధ్య కాలం) గానూ తెలుగు భాషలో భారతదేశంలో నిర్మించబడిన మరియు సెం్టల్‌ బోర్డ్‌ ఆఫ్‌ పిల్మ్‌ సర్టిఫికేషన్‌చే ప్రజా ప్రదర్శన కొరకు సర్టిఫై చేయబడిన చిత్రాల కొరకు ఆసక్తి గల నిర్మాతల నుంచి ఎంట్రీలకు ఆహ్వనం కోరుచున్నాం. ఒక కేటగిరీలో నమోదైన ఫిల్మ్‌లు మరో కేటగిరీలో నమోదు కోసం అర్హత కలిగి ఉండవు. డబ్‌ చేసిన లేదా పునర్‌ నిర్మించిన చిత్రాలు అవార్డులకు అర్హత కలిగివుండవు. అన్ని విధాలా పూర్తి చేసిన ఎంట్రీ ఫారాలను చివరి తేదీ 08.04.2017 లోపు దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా మ్త్రామే దాఖలు చేయాలి.  పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్‌ సైట్‌  ఎపిఎస్‌ఎఫ్‌టివిటిడిసి.ఇన్‌ సందర్శించగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com