వారనాసి నుంచి పోటీకి దిగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కాశీలో భారీ రోడ్ షో నిర్వహించారు. శుక్రవారం నామినేషన్ వేయనున్న క్రమంలో జరిగిన ఈ రోడ్ షోకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు నేతలు తరలి రావటంతో బిజెపి శ్రేణులు ఈ ర్యాలికి భారీ ఎత్తున జనం తరలి ంచారు. ఏడు కి.మీ. మేర రోడ్ షో ను ఆరంభించిన ప్రధాని మోడీ తొలుత బెనారస్ హిందూ యూనివర్సిటీ గేట్ వద్ద పండిట్ మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి పూల మాల వేసి జండా ఊపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నాకెంతో బలాన్ని ఇస్తున్నది మీ ఆశీర్వాదం మనమంతా కలిసికట్టుగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసాం. వాటిలో చాలా వారుకు విజయాలను సాధించామన్నారు.