ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని ఏపి సిఎం చంద్రబాబు అన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి సహకరించకపోగా.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. వ్యవస్థలను అన్నింటినీ మోదీ భ్రష్టు పట్టించారు. భాజపా ఆర్థిక విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోయింది. ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేశారు. అసత్యాలు చెప్పడంలో మోదీ దిట్ట. మెరుపు దాడులపై ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. మోదీ పాలనలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. మోదీ అన్నీ హామీలే ఇస్తారు తప్ప ఏమీ చేయరు. ఐదేళ్ల పాలనలో రూపాయి విలువ బాగా క్షీణించిపోయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల రెండు శాతం అభివృద్ధి ఆగిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో ఏటీఎంలు, బ్యాంకుల్లో డబ్బుల్లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీఎస్టీతో వ్యాపారులంతా బాగా దెబ్బతిన్నారు. సీబీఐ, ఐటీ, ఈడీలాంటి సంస్థలను సైతం నాశనం చేశారు. ప్రతిపక్ష నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్ స్లిప్పుల్లో పరిశీలించాలి. సుప్రీంకోర్టుకే తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన వాళ్లు దేనికైనా తెగిస్తారు. 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని మేమంతా పోరాడుతున్నాం. ఏపీలో రైతులకు రూ.24,500 కోట్లు రుణవిముక్తి కల్పించాం. దేశంలోని బ్యాంకులను దోపిడీ చేసిన దొంగలు విదేశాలకు పారిపోయారు. అవినీతిని భాజపా పెంచి పోషిస్తోంది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి మోసం చేశారు’’ అంటూ ధ్వజమెత్తారు.