ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొక్కిసలాటలో... ఏడుగురు భక్తులు మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2019, 02:39 PM

   తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఓ ఆలయ ఉత్సవంలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు సహా ఏడుగురు భక్తులు మృతి చెందారు. తురైయూర్‌ సమీపంలోని ముత్యంపాలయంలో ఉన్న కరుప్పనస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 10.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్ర పౌర్ణమి ఉత్సవంలో భాగంగా నాణేల పంపిణీ జరిగినప్పుడు క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. మృతులను ఆర్.లక్ష్మీకాంతం (60), కె.రాజవేల్ (55), ఎస్.గాంధయీ (38) , ఎ.శాంతి (50), రామర్ (50), వి.పూంగవనం (50), ఆర్.వల్లి (35)గా గుర్తించారు. వీరంతా కరూర్, కడలూరు,సేలం, నమక్కల్, విల్లుపురం జిల్లాలకు చెందిన వారు. ఆలయంలో ఏటా ఘనంగా జరిగే ఉత్సవం కావడంతో ఆదివారంనాడు భక్తులు పోటెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com