హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యానన్న మనస్థాపంతో సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ కాలేజీలో ధర్మారామ్ ఇంటర్ చదివాడు. ఏడో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.