అమరావతి: లారీల యజమానులు నేటి నుంచి దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. సమ్మెతో ఏపీలో 3 లక్షలకు పైగా, తెలంగాణ రాష్ట్రంలో 2.7 లక్షలకు పైగా లారీల రాకపోకలు నిలిచిపోయాయి. 2015లో ఇచ్చిన హామీల అమలుకు లారీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. 15 ఏళ్లు తిరిగిన వాహనాల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్కు అనుమతించాలని, చలానా, టోల్ రుసుంలు తగ్గించాలని లారీ యజమానులు డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు.