అమరావతి : 16వ నెంబర్ జాతీయ రహదారిపై పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన 66 రహదారి భద్రత వాహనాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 16వ నెంబర్ జాతీయ రహదారి డెమోకారిడార్గా పిలవబడుతుందన్నారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 24 వేల రోడ్డు ప్రమాదాల్లో 8 వేల మందికిపైగా చనిపోతున్నారని వివరించారు. అతివేగం, మద్యం తాగడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకే గస్తీ వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.