దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసులు రోహిణీ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో 52 సెమీ ఆటోమెటిక్ పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మధ్యప్రదేశ్ బద్వానీ పట్టణానికి చెందిన అమ్రికన్ సింగ్, షీతల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా సమాచారం తెలియాల్సి ఉంది.