అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎస్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఈడీబీ) ఢిల్లీలోని తాజ్ ప్యాలస్లో సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో ఆయన పాల్గొంటారు. సోమవారం మధ్యాహ్నం ఇక్కడి నుంచి బయల్దేరి వెళతారు. సాయంత్రం 5 నుంచి 8.30 గంటల వరకు సమ్మిట్లో పాల్గొంటారు.