విజయవాడ, మేజర్న్యూస్: 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికలో పేర్కొన్న లక్ష్యాలను సాధించే దిశగా బ్యాంకర్లు కషి చేయాలని మంత్రి పుల్లారావు కోరారు. ఆంధ్రా బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను మంత్రి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లను ఉద్దేశించి మంత్రి పుల్లారావు మాట్లాడుతూ 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు మొత్తం రూ 19,600.39 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వీటిలో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ. 11,634.97 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఈ మొత్తంలో వ్యవసాయ రుణాలకు రూ 9,020.32 కోట్లు, ఇతర రుణాలకు రూ. 1,829.67 కోట్లు కాగా మౌలిక సదుపాయాలకు, ఇతర కార్యక్రమాలకు రూ. 784.98 కోట్లు కేటాయించామన్నారు.