కేసీఆర్తో కలిస్తే తప్పేంటన్న జగన్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీడీపీ నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. మోడీ వచ్చినప్పుడు చేసిన నిరసనల కంటే మిన్నగా జగన్కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఆందోళనలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని జగన్ మరిచారేమో కానీ ప్రజలు మరువలేదన్నారు. ఏపీ పడుతున్న కష్టాలకు కేసీఆరే కారణమన్నారు. కేసుల కోసం కేసీఆర్తో జగన్ జతకట్టారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే జగన్ మద్దతిచ్చారన్నారు.