చిత్తూరు జిల్లా సత్యవేడులో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలలో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావాలన్నారు. అప్పులలో ఉండి కూడా ఐదేళ్లలో ఎంత చేసి చూపించానో.. మరో పదేళ్లు ఇదే పట్టుదలతో ముందుకు పోతే దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఏపీ ముందుంటుందన్నారు. కొందరు తెలంగాణలో ఉండి..జగన్ ను అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని.. ప్రజలు తెలివిగా ప్రవర్తించకపోతే జీవితాలు తారుమారవుతాయన్నారు. మా ఐదేళ్ల పాలనలో ఎంత ఆనందంగా ఉన్నారో.. రానున్న ఐదేళ్లలో అంతకుమించి సంపదను పెంచి..అంతకు మించి ఆనందంగా ఉంచుతామన్నారు.