సోంపేట జిల్లా అదనపు జడ్జి సిపి.వింధ్యేశ్వరి (55) సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోర్టు వెనుక ఉన్న తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని వింధేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. వింధేశ్వరి ఇంటి పనివారు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా జడ్జిగా పని చేసిన వింధేశ్వరి బదిలీ పై 2018 డిసెంబర్ చివరిలో సోంపేటలో ఆరో అదనపు జిల్లా జడ్జిగా విధుల్లో చేరారు. తర్వాత రెండు నెలలు సెలవు పెట్టి తిరిగి ఈ సంవత్సరం మార్చిలో విధుల్లో చేరారు. కోర్టు పేటలోని ఓ ప్రైవేట్ ఇంటిలో వింధేశ్వరి అద్దెకి ఉంటున్నారు. నైట్ వాచ్ మెన్ను కూడా పెట్టుకోలేదు. ఒంటరిగానే ఆమె ఉంటున్నారు. ఈ రోజు ఉదయం యథా ప్రకారంగానే.. ఇంటి పనివారు వెళ్లి, ఇంటి తలుపులు ఎంతసేపు కొట్టినప్పటికీ తెరవకపోవడంతో, కోర్టు సిబ్బందికి తెలిపారు. కోర్టు సిబ్బంది తలుపులు పగలగొట్టి చూసే సరికి ఫ్యాన్ ఉరి వేసుకొని వింధేశ్వరి ఆత్మహత్య చేసుకొని ఉన్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.