ఎన్నికల సందర్భంగా ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలపై ఇప్పటికే రాజకీయ పార్టీలకు నోటీసులు ఇచ్చామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాకు తెలిపారు. శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ ఈ విషయంలో దాదాపు అన్ని పార్టీల నుంచి వివరణలు అందాయని, వీటిని అన్ని కోణాలలో పరిశీలిస్తున్నాం. ఒకవేళ విద్వేషపూరిత ప్రకటనలు చేసినట్టు భావిస్తే మాత్రం కేసులు పెట్టేందుకు వెనుకాడబోము" అని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. అలాగే సామాజిక మీడియాలోనూ వస్తున్న తప్పుడు కథనాలపైనా దృష్టి సారించామని, సంబంధిత వ్యక్తులను సైతం వదిలి పెట్టబోమని తేల్చి చెప్పారాయన.