ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెసిఆర్ అంటే నాకు గౌరవం గాని భయం లేదు : పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2019, 05:43 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్  చేశారు.  ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైసీపీ, తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. సమావేశంలో పవన్ మాట్లాడుతూ భీమవరంను హైదరాబాద్ కు  దీటుగా విశ్వా నగరంగా చేయక పొతే నా పేరు పవన్ కళ్యాణ్ యే కాదు.విదేశాలకు మనం వెళ్లడం కాదు,అమెరికా వాళ్లే మన భీమవరం వచ్చేలా చేదాం అని పవన్ అ న్నారు... ఇటీవల కొందరు నేతలు తమ జనసేన పార్టీలో చేరదామని వచ్చి మరీ.. తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారని  చెప్పారు. ఇలా ఎందుకు చేశారని ఆరా తీస్తే.. కారణం కేసీఆర్ అని తేలిందని పవన్ అన్నారు. ఆ నేతలందరికీ హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయని...వాటితో తమకు సమస్యలు ఉన్నాయని అందుకే వైసీపీలోకి వెళ్తున్నామని ఆ నేతలు తనకు చెప్పారన్నారు.


ప్రస్తుతం జరుగుతుంది చూస్తుంటే తనకు పూర్తిగా అన్నీ అర్థమౌతున్నాయని పవన్ అన్నారు.ఓట్లు వేసేముందు ప్రజలు అన్ని విషయాలు ఆలోచించాలని, ఎవరి హయాంలో మేలు జరిగిందో.. ఎవరి హయాంలో అవినీతి, ఘోరాలు జరిగాయో బేరీజు వేసుకొని ఓటు వేయాలని పవన్‌ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com