ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటికో ఉద్యోగం ఎక్కడ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2017, 01:35 AM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చి 34 నెలలు గడు స్తున్నా  ఇంతవరకు ఆ ఉద్యోగాల జాడ ఎక్కడ..? అని ప్రశ్నించారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేశ్‌, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణల సంయుక్త ఆధ్వర్యంలో వేలాది మంది నిరుద్యోగులతో టీఎస్‌పిఎస్‌సి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఉద్యోగాలు భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. అసలు తెలంగాణ ఉద్యమమే నిధులు, నియామకాలు, నీళ్ల కోసం జరిగింది కానీ..నేడు నిధులు కాంట్రాక్టర్లకు, నియమ కాలు గాలికి, నీళ్లు సముద్రానికి దారాదత్తం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలల్లో 2లక్షల ఖాళీలున్నా... ఇంతవరకు 5వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఇటీవల 21 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఇతర కార్యాల యాలు ఏర్పాటయ్యాయని, కానీ ఏ కార్యాలయానికి వెళ్లినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని చెప్పారు. గ్రూపు-2 సర్వీస్‌ ఉద్యోగాలు నోటిఫై చేసి కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడు తున్నారని మండిపడ్డారు. గ్రూపు-3లో 8వేలు, గ్రూపు-4లో 36వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయలేదన్నారు. అలాగే 6వేల జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లను భర్తీ చేయడం లేదన్నారు. అగ్రికల్చర్‌, ఇంజనీరింగ్‌ పోస్టులతో పాటు 40వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఈ ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రాధాన్యత లేని వాటర్‌ గ్రిడ్‌ పథకానికి రూ.40వేల కోట్లు భారీ మొత్తంలో కేటాయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. నిరుద్యోగుల పొట్టగొట్టి కాంట్రాక్టర్ల ఇళ్లను నిం పుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరు ద్యోగులు ఉద్యోగాల కోసం గాకుండా వేల కోట్ల అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ ముట్టడి కార్యక్రమంలో విద్యార్థి కో-ఆర్డి నేటర్‌ డాక్టర్‌ ర్యాగ అరుణ్‌, వేముల రామకృష్ణ, గజేందర్‌, భూపేశ్‌ సాగర్‌, అభిలాష్‌ యాదవ్‌, కృష్ణుడు, అంజి, భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com