ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులివెందల ప్రజలంటే వివేకాకు ఎంతో అభిమానం : వివేకానంద రెడ్డి కుమార్తె

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2019, 12:22 PM

ఆయనకు ఎప్పుడు ప్రజలే ముందు...ఆయన ఎప్పుడూ ప్రజల మనిషే.ఈ రోజు వివేకానంద రెడ్డి కుమార్తె మీడియా తో మాట్లాడుతూ ...  పులివెందల ప్రజలంటే వివేకాకు ఎంతో అభిమానం.పులివెందల ప్రజల తర్వాతే ఫ్యామిలీకి ప్రాధాన్య‌త ఇస్తారు. అమ్మ అనారోగ్యం కారణంగా నా దగ్గరే ఉండేది...కాబట్టి నాన్న ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. సంఘటన జరిగిన తరువాత ...టీవీలలో చూసి జరిగే సంఘటనలు చూసి ఇంకా బాధ ఎక్కువ అయింది. చనిపోయిన మా నాన్న గురించి కొందరు మాట్లాడటం చూస్తే ఎంతో బాధ గా ఉంది.ఇలాంటి ఆరోపణలు జరిగితే ఇన్వెస్టిగేషన్ నిజంగా ఎలా జరుగుతుంది.జగనన్న సీఎం కావాలని మా నాన్న కష్టపడేవాడు. నాన్న చావును కూడా రాజకీయ విమర్శలకు వాడుకోవడం దుర్మార్గం. మా కుటుంబంలో గొడవలు అని సృష్టించి అసత్య ఆరోపణలు చేస్తున్నారు..మా కుటుంబంలో 700 మంది సభ్యులం ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళే నిజ నిజాలు బయటపెడతారు..చనిపోయిన వ్యక్తి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఒక కూతురుగా నా బాధ ఎవరికి చెపుకోవాలో అర్థం కాలేదు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com