వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తేల్చి చెప్పారు. వివరాల్లోకి వెళ్తే...పూణే లో ఎన్సీపీ సీనియర్ల సమావేశం ఈ రోజు జరిగింది. ఎన్నికల్లో పోటీ విషయం పై స్పందించిన పవార్ మాట్లాడుతూ.. మాధా నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయట్లేదన్నారు. కుటుంబంతో, స్నేహితులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే నా కుటుంబం నుంచి ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను పోటీ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. శరత్ ఇప్పటికి 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. బీసీసీఐ ఛైర్మన్గానూ వ్యవహరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ప్రజలు, పార్టీ నాయకులు ఇప్పటికీ నన్ను పోటీ చేయమని అంటున్నారు. వారి మాట కాదని అంటున్నందుకు మన్నించాలి అని అన్నారు. కాగా మాదా నుంచి శరత్ మనవడు పార్థ్ పవార్ పోటీ చేసే అవకాశమున్నట్లు సమాచారం.