ట్రెండింగ్
Epaper    English    தமிழ்

24వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 22, 2019, 09:47 PM

జనసేన అధ్యక్షులు   పవన్ కల్యాణ్   ఈ నెల 24 వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తొలి రోజు కర్నూలు నగరంలో రోడ్ షో నిర్వహిస్తారు. మహిళల సమస్యలు, స్వయం ఉపాధి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంబంధిత వర్గాల ప్రతినిధులతో చర్చిస్తారు. ముస్లిం మైనార్టీలకు సంబంధించిన చర్చా కార్యక్రమంలో సచార్ కమిటీ సిఫార్సుల అమలు, ముస్లిం యువతకు నైపుణ్యాల అభివృద్ధి స్థానికంగా ఉపాధి కల్పన అంశాలపై చర్చ ఉంటుంది. 25వ తేదీ ఆదోనిలో పర్యటిస్తారు. అందులో భాగంగా  పవన్ కల్యాణ్   పత్తి రైతులను కలసి వారి సమస్యలు తెలుసుకుంటారు. 26వ తేదీన ఆళ్ళగడ్డలో పర్యటిస్తారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com