పాకిస్తాన్లోని భారత రాయబారి అజయ్ బిసరియా, అమెరికాలో భారత రాయబారి హర్ష వర్వన్ శ్రింగాలాతో బుధవారం ఉదయం కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో వేర్వేరుగా భేటీ అయ్యారు. సమావేశం అనంతరం అజయ్ మాట్లాడుతూ భారత రాయబారులు ఇతర దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నారని తెలిపారు. పాకిస్తాన్ అబద్దాలను బహిర్గతం చేసే నూతన వివరణాత్మక పత్రాన్ని హోం మంత్రిత్వ శాఖ సిద్ధం చేయనున్నట్లు, అన్ని భారత రాయబార కార్యాలయాల్లో దీనిని పంచుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. పుల్వామాపై ఉగ్రదాడి అనంతరం సంప్రదింపుల నిమిత్తం ఆయా దేశాల రాయబారులను తమతమ దేశాలకు పిలిపించుకున్నాయి. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడానికి ఇతర దేశాలతో చర్చిస్తామని ప్రధాని మోడీని ప్రకటించిన అనంతరం ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై పాక్ తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రకటన చేసింది. పుల్వామా దాడిని న్యూజిలాండ్ పార్లమెంట్ ఖండించింది.