ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడు రాష్ట్రంలో దారుణం..కూతురును గొంతు నులిమి

national |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 03:47 PM

మరో యువకుడితో వివాహం చేసుకొనేందుకు తనకు అడ్డుగా ఉందని స్వంత కూతురునే  తల్లి హత్య చేసిన ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా వానియంబాడి నేతాజీ నగర్‌కు చెందిన నళినికి బెంగుళూరుకు చెందిన బెంగళూరుకు చెందిన శివకుమార్‌తో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరి గింది.వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో నళిని భర్తను,కొడుకును వదిలి కుమార్తెతో కలిసి పుట్టింటికి వచ్చింది. భర్త వద్దే కొడుకును వదిలేసింది.


నళినికి చెన్నైకు చెందిన మురళితో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం సహజీవనం వరకు దారితీసింది. వీరిద్దరూ కూడ వానియంబాడిలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరిద్దరూ కూడ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే మురళిని పెళ్లి చేసుకోవాలని నళిని కోరింది. అయితే అందరిని వదిలేసి వస్తే తాను పెళ్లి చేసుకొంటానని నళినికి చెప్పాడు. దీంతో తన వద్దే ఉన్న కూతురును గొంతు నులిమి చంపేసింది. అయితే ఏమీ తెలియనట్టుగానే ఆమె పసిపాపను ఆసుపత్రికి తీసుకెళ్లింది. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి మృతి చెందినట్టుగా డాక్టర్లు గుర్తించారు. కానీ, పాప శరీరంపై గాయాలు ఉండడంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు ఈ విషయమై నళినిని ప్రశ్నిస్తే అసలు విషయాన్ని ఆమె బయటపెట్టింది. చిన్నారి అడ్డు తొలగితే మురళిని పెళ్లి చేసుకోవచ్చని భావించి చిన్నారిని హత్య చేసినట్టుగా నళిని ఒప్పుకొంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com