చెన్నై: తమిళనాడు రాజకీయాలను కీలక మలుపులు తిప్పిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం వర్గం క్రమంగా బలం పుంజుకుంటోంది. జయలలిత మృతితో అధికార అన్నాడీఎంకేలో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తడంతో జరిగిన ఆధిపత్య పోరుతో ఆ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్గా ఉన్న మధుసూదనన్తో సహా కొందరు మంత్రులు, సీనియర్ నేతలు పన్నీర్వైపు నిలిచిన విషయం తెలిసిందే. అయితే, తన అనుచరుడైన పళనిస్వామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టడంలో శశికళ సఫలీకృతమయ్యారు. పన్నీర్కే తన మద్దతు అంటూ దీపా జయకుమార్ స్థాపించిన రాజకీయ వేదికకు చెందిన తిరుచ్చి మాజీ ఎమ్మెల్యే సౌందరరాజన్ సోమవారం ప్రకటించగా.. తాజాగా శశికళ వర్గానికి మద్దతుదారుగా ఉన్న ప్రముఖ న్యూస్ యాంకర్, సినీనటి నిర్మలా పెరియస్వామి నేడు పన్నీర్ వర్గంలో చేరారు.