ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెస్లా కారులో చెలరేగిన మంటలు.. నలుగురు భారతీయులు మృతి

international |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 05:45 PM

కెనడాలోని టొరంటో సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఓ టెస్లా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్‌లోని గోద్రాకు చెందిన కేతా గోహిల్‌ (30), నిల్‌ గోహిల్‌ (26).. మరో ఇద్దరు వ్యక్తులతో టెస్లా కారులో ప్రయాణిస్తున్నారు. ఆ టెస్లా కారు డివైడర్‌ని ఢీకొట్టడంతో బ్యాటరీలు పేలి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com