శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం రామాపురం గ్రామంలో ఆదివారం కాల్పుల ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే తెలంగాణలో పలు కేసుల్లో నిందితులైన ఐదు మంది దొంగలు బత్తలపల్లి మండలం రామాపురం గ్రామ సమీపంలో ఉన్నట్లు గుర్తించిన తెలంగాణ పోలీసులు ఆదివారం వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. పోలీసులను చూసి దొంగలు పారిపోతుంటే పోలీసులు కాల్పులు జరపగా దొంగలు పరారయ్యారు.