విజయవాడ, సూర్య బ్యూరో : తెలుగు రాష్ట్రాలపై ప్రధాని నరేంద్రమోడీ సవతి ప్రేమ చూపుతున్నారనీ, చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేసారు.
ఈ మేరకు కె. రామకృష్ణ నేడొక ప్రకటన విడు దల చేసారు. యుపీలో గెలిపిస్తే చిన్న, సన్నకారు రైతుల రుణా లను మాఫీ చేస్తామని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో స్వయంగా హామీ ఇవ్వగా, యుపీలో ఏర్పడే కొత్త ప్రభు త్వం రైతుల రుణాలను మాఫీ చేస్తుందనీ, అందువల్ల సర్కా రుపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్ లోక్సభలో స్పష్టం చేసారు. ప్రాంతాలపట్ల పక్షపాతం చూపడం వల్ల దేశ సమైక్యతకు ముప వాటిల్లే ప్రమాదముంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో రైతాంగం తీవ్ర కరువు ప్రభావంతో అల్లాడు తుంటే కనీసం పట్టించుకోలేదు.
ఆంధ్రప్రదేశ్లో రైతులు అపల ఊబిలో కూరుకుపోయి అల్లాడుతున్నారు. పొట్టకూటికోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికలలో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ కూడా సక్రమంగా అమలుకు నోచుకోలేదు. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు రిజర్వబ్యాంక్ను ఒప్పించమని రాష్ట్ర ప్రభుత్వాలు మోదీని కోరినా కూడా స్పందించ లేదు. దీనినిబట్టి గమనిస్తే తెలుగు రాష్ట్రాలపట్ల కేంద్రానికున్న పక్షపాత వైఖరి బహిర్గత మవు తున్నదన్నారు. ఉత్తరప్రదేశ్ రైతులకు కేంద్రం రుణమాఫీ వర్తింపచేసే విధంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రైతులకు కూడా రుణమాఫీ వర్తింప చేయాలని, రుణాల రీషెడ్యూల్ చేసేందుకు రిజర్వ బ్యాంక్ను ఒప్పించాలని డిమాండ్ చేస్తున్నా మన్నారు.