విజయవాడ, సూర్య బ్యూరో : విజయవాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని ఎ ప్లస్ కన్వెన్షన్సెంటర్లో ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ఆంద్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) రాష్ర్ట ప్లీనరీ గ్రామీణ, పట్టణ జర్నలిస్టుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం లక్ష్యం గా ఏపీజేఎఫ్ ఈ ప్లీనరీని నిర్వహిస్తుంది. ప్లీనరీ జయప్రదానికి గాను ఏపీజేఎఫ్ రాష్ర్ట అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంతో కలిపి 6 జిల్లాలలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీజేఎఫ్ మహాసభలకు తరలివస్తామని అన్ని ప్రాంతాల జర్నలిస్టులు ఈ సందర్బంగా ప్రతినబూనారు. ఏపీజేఎఫ్ సైనికుల్లా పనిచేస్తా మంటూ నందికొట్కూరు యువ జర్నలిస్టు కర్నూలులో జరిగిన నమావేశంలో మాట్లాడటం అక్కడకు విచ్చేసిన ప్రతిఒక్క జర్నలిస్టుకు స్పూర్తిని కలిగించింది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ఊపిరిగా పనిచేస్తున్న ఏపీజేఎఫ్ వంటి యూనియన్ను తాను ఇంత వరకూ చూడలేదన్నారు. గత యూనియన్లకు భిన్నంగా నిస్వార్దంగా పనిచేసే నాయకత్వం వుండటమే ఏపీజేఎఫ్ బల మని అభివర్ణించారు. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలలో నిర్వహించిన ప్లీనరీ సమావేశా లకు మంచి స్పందన లభించింది.
ప్లీనరీ సమావేశాలలో భాగంగా రాయల సీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో పర్యటించిన రాష్ర్ట అధ్యక్షులు చెవుల కష్ణాంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ నిధికి రాష్ర్ట ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులను ప్రకటించాలని మహాసభ వేదికగా కోరనున్నట్లు వెల్లడిం చారు. ఈ సంక్షేమ నిధి ద్వారా సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ అందించే అవకా శం ఉందన్నారు. ఏపీజేఎఫ్ ప్రతిపాదన మేరకు రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల భీమా పథకం ప్రమాదవశాత్తు మరణించిన జర్నలిస్టులకు మా్తమ్రే వర్తిస్తుందని, సాధారణంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు సైతం రూ.5 లక్షల వంతున అందించాల్సి ఉంటుందన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు, పక్కాగహాల నిర్మాణం, జర్నలిస్టుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందించే విధంగా రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరనున్నట్టు ఈ సందర్బంగా చెవుల కృష్ణాంజనేయులు తెలిపారు.