ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 28, 2024, 05:08 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం, గుండుమలలో సీఎం పర్యటించనున్నారు. ఆ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, సింధూర రెడ్డి, కందికుంట వెంకటప్రసాద్, జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న తదితరులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com