శ్రీ సత్యసాయి జిల్లాలోని మహిళా పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా ఎస్పీ రత్న స్పష్టం చేశారు. బుధవారం పుట్టపర్తి స్థానిక పోలీసు కార్యాలయంలో మహిళా పోలీసుల సంఘం రాయలసీమ జోన అధ్యక్షురాలు ఎంవీ భవానీ, ధర్మవరం మహిళా పోలీసు కృష్ణవేణి ఎస్పీని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్పీకి వివరించారు. దీనిపై స్పందించిన ఎస్పీ త్వరలోనే మహిళా పోలీసులందరితో సమావేశం నిర్వహించి అందరి సమస్యలను తెలుసుకుంటానని, వాటి పరిస్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.