జోగుళాంబగద్వాల, మేజర్న్యూస్. ఈనెల 25 నుండి 29 వరకు గద్వాల మార్కెట్ యార్డు సమీపంలొ జరిగే గద్వాల సంబరా లను విజయవంతం చేయాలని జొగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్కుమర్ సైనీ తెలిపారు. శుక్రవారంనిర్వహించిన విలేకర్ల సమావేశంలొ ఆయన మాట్లాడుతు గద్వాల కళలు, స్థానిక కళాకారులను చాటిచెప్పే విధంగా సంబరాలు జరుగుతాయని తెలి పారు. చేనేత, ఉద్యానవన ఇతర శాఖలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకుని ప్రజలకు వారి శాఖతరపున అబివృద్దిని వివరిస్తారని తెలిపారు. అలాగే కళాకారులు సాయంత్రం సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని గద్వాలతొ పాటు కర్నూల్, హైదరాబాద్, నల్గొండ,ఖమ్మం తదితర ప్రాంతాలనుండి కళాకారులు వచ్చి తమకళను ప్రదర్శిస్తారని తెలిపారు. ఎస్పీ విజయ్కుమార్ మాట్లాడుతూ సంబరాలు విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరిం చాలని కోరారు. సంబరాలకు వచ్చే వాహనాలకు ట్రాఫిక్ నియంత్రణ నిర్విహ స్తున్నట్లు తెలిపారు. సంబరాలు ప్రతిఏటా జరిగేలా చూడాలని అన్నారు. ఈ ఉత్సవాలకు మంత్రులు, ఇతర విఐపిలు వస్తారని సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జేసి సంగీత, ఆర్డీఒ అబ్దుల్ హమీద్, అధికారులు పాల్గొన్నారు.