ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనా ల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దైనికైనా రెడి అని మాజీ మంత్రి,ఆ పార్టీ సినియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రానికి సంక్రమించిన హక్కు సాధించుకోవడంలో కష్టమవుతుందన్నారు .రాష్ట్రాల హక్కులను సాధించుకోవడం కోసం పోరాడేందుకు ఏర్పాటైందే ఫెడరల్ ఫ్రంట్ అన్నారు.దేశంలోని ఇతర రాష్ట్రాతో చర్చిస్తున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టిఆర్ ఎస్ సంప్రదించిందన్నారు.విభజన హామీలు అము చేయాలని డిమాండ్ తో పోరాటం చేస్తున్న వై.ఎస్ జగన్ కు మద్దతు తెలిపి తాము బాసటగా నిలుస్తామని కేసీఆర్ చెప్పడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పోరాటం చేస్తామంటే వైసిపి,టిఆర్ ఎస్ కలిసి పోటీ చేయడం కాదన్నారు.ఆంధ్రప్రదేశ్ లో టిఆర్ ఎస్,వైసిపి కలిసి పోటీ చేస్తాయని ఎక్కడా చెప్పలేదన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ ముందుకు వస్తే ఆ రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం చేయడానికి సిద్దమని ఎప్పుడో జగన్ చెప్పారన్నారు. జగన్ ఆలోచనకు మద్దతు పలికిన మరో ప్లాట్ ఫాం ఫెడరల్ ఫ్రంట్ అన్నారు.అటువంటి అవకాశం లభిస్తే తిరస్కరించాలా చెప్పండంటూ చంద్రబాబుని ప్రశ్నించారు.