కలియుగ వైకుంఠమైన తిరుమలలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మంగళవారంనాడు అధికారులతో కలిసి పరిశీలించారు. అందులో భాగంగా తిరుమలలోని బాలాజి నగర్లో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజి, విద్యుత్ దీపాలు తదితర వాటిని పరిశీలించారు. అక్కడి స్థానికులకు తాగునీరు అందించేందుకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆర్ఒ ప్లాంట్ను పరిశీలించారు. శ్రీ వినాయకస్వామివారి ఆలయ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలాజి నగర్లోని సమస్యలను స్థానికులు తనకు తెలియచేశారని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడి స్థానికులకు టిటిడి చేస్తున్న అభివృద్ధి పనులను, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పిఏసి-2లోని వంటశాలను పరిశీలించి, దీనిని విస్తరించడానికి పలు సూచనలు చేశారు.